- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, భద్రాచలం : గత ఆరు రోజులుగా మావోయిస్టుల చెరలో ఉన్న కోబ్రా జవాన్ రాకేశ్వర్ సింగ్ మన్హాస్ గురువారం సాయంత్రం క్షేమంగా విడుదలైనారు. ఈనెల 3న ఎన్కౌంటర్ సమయంలో మావోయిస్టులకు చిక్కిన్ జవాన్ని వారు తమ వెంట బందీగా తీసుకెళ్ళారు. అతడికి ఏ హాని తలపెట్టకుండా క్షేమంగా విడిచి పెట్టాలని కుటుంబ సభ్యులు, పలు సంఘాలు విజ్ఞప్తి చేశారు. మధ్యవర్తుల ద్వారా జవాన్ని విడుదల చేస్తామని మావోయిస్టులు సైతం ప్రకటించడంతో మధ్యవర్తిత్వం కోసం ఇద్దరు సభ్యుల బృందాన్ని సీజీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు పద్మశ్రీ ధరంపాల్ సైని, గోండ్వానా సమాజ్ ప్రసిడెంట్ తెల్లం బోరియాతో సహా ప్రభుత్వం తరపున ఇద్దరు సభ్యులు, ఏడుగురు పాత్రికేయులు కలిసి మొత్తం 11 మంది ఈరోజు బస్తర్ అడవికి చేరుకున్నారు. వందలాది గ్రామస్థుల సమక్షంలో జవాన్ని మావోయిస్టులు ఆ బృందానికి అప్పగించినట్లు సమాచారం. మావోయిస్టుల చెర నుంచి జవాన్ విడుదల కావడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. కాగా జవాన్ విడుదలకి సంబంధిన వీడియో, ఫోటోలు కింద ఉన్నాయి చూడవచ్చు.