కరోనాతో అభిమాని మృతి.. కన్నీరు పెట్టుకున్న జగపతి బాబు

by  |
కరోనాతో అభిమాని మృతి.. కన్నీరు పెట్టుకున్న జగపతి బాబు
X

దిశ, సినిమా : కరోనా మహమ్మారి దేశాన్ని పీడిస్తోంది. లక్షలాదిమంది జనం కొవిడ్ కారణంగా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ‘హాస్పిటల్‌లో బెడ్ దొరకదు.. స్మశానంలో ప్లేస్ దొరకదు’ అన్నట్లుగా తయారైంది పరిస్థితి. ఈ క్రమంలో కరోనాతో చనిపోయిన అభిమాని గురించి తెలుపుతూ ఎమోషనల్ వీడియో షేర్ చేశాడు జగపతి బాబు. 20 ఏళ్లుగా గుంటూరు అభిమాన సంఘం ప్రెసిడెంట్‌గా ఉన్న శీను కరోనాతో చనిపోవడం బాధగా ఉందన్నాడు. అతని భార్య, ఇద్దరు పిల్లలకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చిన జగ్గు భాయ్.. ‘కళ్లముందే ప్రాణాలు పోతున్నాయి, ఎవరెప్పుడు చనిపోతారో తెలియడం లేదు’ అని భావోద్వేగానికి గురయ్యాడు. ఇప్పటికైనా అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. తప్పనిసరిగా మాస్క్ ధరించడంతో పాటు శానిటైజర్ యూజ్ చేయాలని కోరాడు.

Next Story

Most Viewed