- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేశారని వైఎస్సార్సీపీ అధికారిక ట్విట్టర్ ఖాతా తెలిపింది. ఈ ట్వీట్లో ఏమందంటే.. “గుజరాత్లో చిక్కుకున్న తెలుగు మత్స్యకారులను ఆదుకోవాలని గుజరాత్ సీఎం విజయ్రూపానీకి ఏపీ సీఎం వైయస్ జగన్ ఫోన్. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతి, భోజన సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేసిన సీఎం వైయస్ జగన్. సానుకూలంగా స్పందించిన సీఎం రూపానీ, అన్ని విధాలా ఆదుకుంటామని హామీ” అని తెలిపింది.
కాగా, నాలుగు రోజుల క్రితం పొట్టకూటి కోసం గుజరాత్ సముద్ర తీరానికి వెళ్లి, లాక్ డౌన్ కారణంగా చిక్కుబడిపోయి, అన్నపానీయాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సుమారు 4,000 మంది ఏపీ మత్స్య కారులను ఆదుకోవాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జగన్, విజయ్ రూపానీలకు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖలో వారి ప్రతినిధుల ఫోన్ నెంబర్లు కూడా జతచేశారు.
Tags: ysrcp, tdp, twitter, ap cm, jagan, gujarath cm, vijay rupani, fishermen, ap