సీఎం రూ.6500 కోట్లు కాజేశారు: పట్టాభి

by  |
సీఎం రూ.6500 కోట్లు కాజేశారు: పట్టాభి
X

దిశ,వెబ్‌డెస్క్: ఇండ్ల పట్టాల పంపిణీలో జగన్ రూ.6500 కోట్లు కాజేశారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఆరోపించారు. పేదల కోసం టీడీపీ నిర్మించిన టిడ్కో ఇండ్లలో మరో రూ.4 వేల కోట్లను మింగేశారని అన్నారు. ఇండ్లకు సంబంధించి రుణ మాఫీ హామీని తుంగలో తొక్కారని విమర్శించారు. ఇండ్ల పట్టాల భూములపై టీడీపీ కేసులు వేసిందన్న జగన్ ..నేడు పంపిణీకి ఎలా శ్రీకారం చుట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇన్నాళ్ల నుంచి పట్టాల పంపిణీపై ప్రభుత్వం చేసిన కేసుల ప్రచారం బూటకమని తెలిసిపోయిందన్నారు. పేదల స్వాధీనం లోని అసైన్డ్ భూములను వైసీపీ లాక్కొబట్టే అనేక మంది కోర్టులకు వెళ్లారని తెలిపారు.

Next Story

Most Viewed