ఉద్యోగులకు జగన్ గుడ్ న్యూస్

by  |
jagan
X

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ తెలిపారు. పీఆర్సీ ప్రక్రియ పూర్తయిందని, 10 రోజుల్లో ప్రకటిస్తామని చెప్పారు. తిరుపతి పర్యటనలో సీఎం జగన్‌ను ఉద్యోగులు కలిశారు. ఈ సందర్భంగా పీఆర్సీ ప్రకటించాలని కోరారు. దీంతో పీఆర్సీపై ఉద్యోగులకు జగన్ హామీ ఇచ్చారు. పీఆర్సీ ప్రకటించాలని ఉద్యోగులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కానీ ప్రభుత్వం నాన్చివేత ధోరణి అవలంభిస్తూ వస్తోంది. పీఆర్సీ కోసం ఉద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు జగన్ హామీ ఇవ్వడంతో ఉద్యోగుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి.


Next Story

Most Viewed