నాలుగోసారి కూడా ఈడీ విచారణకు హాజరుకాని జాక్వెలిన్

by  |
Money-Landaring1
X

దిశ, సినిమా: బాలీవుడ్ యాక్ట్రెస్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో అక్టోబర్ 18న ఈడీ ముందు అటెండ్ కావాలని కోరింది. కానీ, పర్సనల్ రీజన్స్‌తో జాక్వెలిన్ హాజరు కాలేకపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సెప్టెంబర్ 25, అక్టోబర్ 15, 16న మూడు సార్లు ఈడీ క్వశ్చనింగ్‌ స్కిప్ చేసిన శ్రీలంకన్ బ్యూటీ.. ఇప్పుడు కూడా అలాగే చేయడంతో దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సుఖేష్ చంద్రశేఖర్, అతని భార్య నీలా పాల్ మనీ లాండరింగ్ కేసుకు జాక్వెలిన్‌కు ఉన్న సంబంధమేంటో తెలుసుకునేందుకు ట్రై చేస్తున్న ఈడీ.. సుఖేష్‌తో పర్సనల్ కనెక్షన్, ఫినాన్షియల్ ట్రాన్జాక్షన్స్ గురించి విచారించనుంది. కాగా తన ఫస్ట్ స్టేట్‌మెంట్‌లో సుఖేష్ ద్వారా నష్టపోయిన బాధితురాలిగా పేర్కొన్న జాక్వెలిన్.. తను ఎలాంటి తప్పు చేయలేదని తెలిపింది. ఇక వర్క్ విషయానికి వస్తే ప్రస్తుతం అక్షయ్ కుమార్‌తో కలిసి ఊటీలో ‘రామ్ సేతు’ షూటింగ్‌లో పాల్గొంటున్న భామ.. ఆ తర్వాత రణ్‌వీర్ సింగ్ ‘సర్కస్’ సినిమా షూటింగ్‌లో జాయిన్ కావాల్సి ఉంది.

Next Story

Most Viewed