పోలీసులకు డార్క్ ఫాంటసీ బిస్కెట్ ప్యాకేట్స్ అందజేత

by  |
పోలీసులకు డార్క్ ఫాంటసీ బిస్కెట్ ప్యాకేట్స్ అందజేత
X

దిశ, నల్లగొండ: కరోనా వ్యాప్తి నియంత్రణకు శ్రమిస్తున్న పోలీసు సిబ్బందికి ఐటీసీ కంపెనీ తమవంతు సాయంగా డార్క్ ఫాంటసీ బిస్కెట్ ప్యాకెట్స్‌ను అందించింది. శనివారం ఐటీసీ కంపెనీ డిస్ట్రిబ్యూటర్, అన్నపూర్ణ సేల్స్ కార్పొరేషన్ అధినేత గట్టాణి శ్రీనివాద్ ఎస్పీ రంగనాథ్‌కు 1800 బిస్కెట్ ప్యాకెట్లు అందించి, జిల్లాలో పని చేస్తున్న పోలీసు సిబ్బంది పంపిణీ చేయాలని కోరారు. కరోనాపై పోలీసులు చేస్తున్న పోరాటంలో ఐటిసి కంపెనీ వారికి బాసటగా నిలవాలని నిర్ణయించి బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. సుమారు రూ.60 వేల విలువ కలిగిన బిస్కెట్లను పోలీసులకు అందించడం తమకు ఎంతో గర్వకారణంగా ఉన్నదని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.


Next Story

Most Viewed