ఐటీసీ స‌హాయం అభినంద‌నీయం: ఎమ్మెల్యే పొదెం

by  |
ఐటీసీ స‌హాయం అభినంద‌నీయం: ఎమ్మెల్యే పొదెం
X

దిశ‌, ఖ‌మ్మం: చేతిలో ప‌నిలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద‌ల‌ను ఆదుకునేందుకు ఐటీసీ సంస్థ ముందుకు రావ‌డం గొప్ప విష‌య‌మ‌ని ఎమ్మెల్యే పొదెం వీర‌య్య‌, భ‌ద్రాచ‌లం ఐటీడీఏ పీవో గౌత‌మ్ కొనియాడారు. శ‌నివారం ఐటీసీ పీఎస్‌పీడీ సంస్థ ఆధ్వ‌ర్యంలో పాతమారేడుబాక గ్రామంలో సంస్థ ప్ర‌తినిధులు ఎమ్మెల్యే పొదెం, ఐటీడీఏ పీవో స‌మ‌క్షంలో 170 గిరిజన కుటుంబాలకు నిత్యావ‌స‌రాల‌ను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న గిరిజనులకు సాయం అందించేందుకు ఐటీసీ సంస్థ‌లు ముందుకు రావ‌డం హర్షనీయం అన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులతో పాటు ఐటీసీ సీఈవో సంజయ్ సింగ్, యూనిట్‌ హెడ్ మకరంద్, జీఎం ప్రభోద్ పాత్రో, అడ్మిన్ మేనేజర్ చంగల్ రావు పాల్గొన్నారు.

Next Story