‘ఈటల రాజేందర్ మాట వినేవాళ్లు ప్రభుత్వంలో లేరు’

by  |
‘ఈటల రాజేందర్ మాట వినేవాళ్లు ప్రభుత్వంలో లేరు’
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో సచివాలయం లేకపోవడంతో పాలన వ్యవస్థ కుప్పకూలిందని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. రాష్ట్రంలో కరోనా కేసుల పెరగడానికి, కరోనా మరణాలకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెబుతున్నా ఆయన మాటలను వినేవాళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వంలో లేరని ఆయన అన్నారు. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. అలానే ఆక్సిజన్ అందక, బెడ్లు లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నా.. ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెంచడంలేదని మండిపడ్డారు. ప్రజల కష్టాలను గుర్తించి కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

Next Story