మంత్రి కేటీఆర్ పరువునష్టం కేసులో తీర్పు రిజర్వ్

by  |
mp revanth Reddy
X

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి కేటీఆర్ డ్రగ్స్ టెస్టు చేసుకోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ విసిరిన విషయం తెలిసిందే. అయితే, తనపై అనవసరంగా అభియోగాలు మోపి తన పరువు ప్రతిష్టలను దెబ్బ తీస్తున్నారని మంత్రి కేటీఆర్ కోర్టును ఆశ్రయించారు. రేవంత్‌ తప్పుడు ఆరోపణలు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కేటీఆర్‌ కోరారు. ఈ క్రమంలో పిటిషన్‌ను కోర్టు స్వీకరించి విచారణ చేపట్టింది. మంగళవారం దీనిపై పూర్తి విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు వెల్లడించింది. కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇస్తూ డ్రగ్స్, ఈడీ కేసుల్లో కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని రేవంత్ రెడ్డిను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 20కి వాయిదా వేసింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed