ఈ నెలాఖరు నుంచి వర్షాలే..

by  |
ఈ నెలాఖరు నుంచి వర్షాలే..
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఈ నెలాఖరు నుంచి వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అరేబియా సముద్రం నుంచి గాలులు వీస్తుండటం, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల నుంచి మేఘాలు ఉత్తరాంధ్రవైపు రావడంతో ఈ నెలాఖరు నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తాయన్నారు. నైరుతి రుతుపవనాలు జూన్ 5 నాటికి రాష్ట్రాన్ని తాకే అవకాశముందన్నారు.

రాష్ట్రంలో ఎండల తీవ్రత ఈ రోజు కూడా కొనసాగుతుందని, వడగాల్పులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు. కాగా నిన్న ఏపీలో పలుచోట్ల 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.



Next Story

Most Viewed