ధరణిలో ఈసీ కాపీ.. హద్దులు లేకుండానే జారీ

by  |
Dharani Portal
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎట్టకేలకు ధరణి పోర్టల్‌లో ఎన్​కంబరెన్స్​సర్టిఫికేట్​పొందే ఆప్షన్​వచ్చింది. ఏదైనా భూమిని ఎవరెవరు కొనుగోలు చేశారన్న విషయాన్ని ఇంటిగ్రేటెడ్ ల్యాండ్​రికార్డ్స్​మేనేజ్మెంట్​సిస్టం నుంచి తీసుకోవచ్చు. మంగళవారం నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చారు. ధరణి పోర్టల్​అందుబాటులోకి వచ్చిన గతేడాది 29 నుంచి నేటి వరకు ఎవరెవరి చేతులు మారిందన్న విషయాన్ని తెలుసుకోవచ్చు.

అంతకు ముందు వివరాలు కావాలంటే గతంలో మాదిరిగా https://registration.telangana.gov.in నుంచి డౌన్​లోడ్​చేసుకోవాలి. గతంలో మాదిరిగానే ఆస్తి వివరాలు, లావాదేవీ జరిగిన తేదీ, కొనుగోలు చేసిన వారు, విక్రయించిన వారు, ఎలాంటి డీడ్​ద్వారా విక్రయించారు, సర్వే నంబర్లు, కొనుగోలు చేసిన విస్తీర్ణం, మార్కెట్​విలువ, పట్టాదారు పాసు పుస్తకం నంబరు, డాక్యుమెంటు నంబరు, తహసీల్దార్​కార్యాలయం వంటి అన్ని వివరాలను పేర్కొన్నారు. ఎన్నిసార్లు చేతులు మారిందో అన్ని వివరాలు ఇస్తున్నారు. అయితే హద్దుల వివరాలను పొందుపర్చకపోవడం కొంత అసౌకర్యానికి గురి చేసే అంశంగా కనిపిస్తోంది. ఈసీ కాపీలో హద్దులకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఆ వివరాలను కూడా నమోదు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పాత మ్యుటేషన్లకూ ఓకే

ఏనాడో సబ్​రిజిస్ట్రార్​కార్యాలయంలో సేల్​డీడ్​ద్వారా కొనుగోలు చేసిన భూములు ఉన్నాయి. అయితే కొందరు రెవెన్యూలో మ్యుటేషన్ చేసుకోకుండా పెండింగులో ఉంచారు. ధరణి పోర్టల్​అమలైన తర్వాత వాటిని మ్యుటేషన్​చేయించుకునేందుకు అవకాశం కల్పించారు. అలాంటి పాత మ్యుటేషన్ల వివరాలను కూడా ఎన్కంబరెన్స్​సర్టిఫికేట్ల ద్వారా తెలుసుకునే అవకాశాన్ని కల్పించారు.

ఎవరి నుంచి ఎవరు కొనుగోలు చేశారు, ఎంత విస్తీర్ణాన్ని కొన్నారు, మార్కెట్​ధరకు కొన్నారన్న వివరాలను చూడొచ్చు. కానీ ఇందులోనూ హద్దులు ఇవ్వలేదు. అలాగే ఏ సబ్​రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్​చేసుకున్నారన్న విషయాన్ని మర్చిపోయారు. గతంలో ఎనీవేర్​రిజిస్ట్రేషన్​విధానం ద్వారా జిల్లాలోని ఏ సబ్​రిజిస్ట్రార్ కార్యాలయంలోనైనా ఏ మండలానికి సంబంధించిన భూములనైనా డీడ్​చేసుకునే వీలుండేది. దాని ద్వారానే లక్షలాది డీడ్స్​అయ్యాయి. ఆ ఎస్సాఆర్వో వివరాలు నమోదు చేయడం ద్వారా భవిష్యత్తులోనూ సంబంధిత భూమి పూర్తి వివరాలను తెలుసుకునే వీలుండేదని రియల్టర్లు అభిప్రాయపడుతున్నారు.

Next Story

Most Viewed