సిక్కులతో మోడీది ప్రత్యేక బంధం: ఐఆర్‌సీటీసీ

by  |
సిక్కులతో మోడీది ప్రత్యేక బంధం: ఐఆర్‌సీటీసీ
X

న్యూఢిల్లీ: రైతుల ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వరంగ సంస్థ, భారతీయ రైల్వే సబ్సిడరీ ఐఆర్‌సీటీసీ, సుమారు రెండు కోట్ల మంది యూజర్లకు బుక్ లెట్ మెయిల్స్ పంపింది. ప్రధాని మోడీకి, సిక్కులతో ప్రత్యేకమైన అనుబంధం ఉన్నదని ఆ మెయిల్స్‌లో పేర్కొంది. సిక్కులకు దన్నుగా నిలిచేలా ప్రధాని మోడీ తీసుకున్న 13 నిర్ణయాలు ఆ బుక్‌లెట్‌లో హిందీ, ఇంగ్లీష్, పంజాబీలలో ఉన్నాయి. ఈ నెల 8 నుంచి 12 మధ్యలో ఈ మెయిల్స్ పంపించింది. యూజర్ల డేటా బేస్ ఆధారంగా మెయిల్స్ పంపినట్టు తెలిసింది. ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ పంపండం కొత్తేమీ కాదని సంస్థ స్పందించింది.

Next Story

Most Viewed