IPL 2023: ఆర్‌సీబీ జట్టులో కీలక మార్పు..

by Disha Web Desk 13 |
IPL 2023: ఆర్‌సీబీ జట్టులో కీలక మార్పు..
X

దిశ, వెబ్‌డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కీలక మార్పు జరిగింది. గాయంతో టోర్నీకి దూరమైన డేవిడ్ విల్లే స్థానాన్ని వెటరన్ బ్యాటర్ కేదార్ జాదవ్‌తో భర్తీ చేసింది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ డేవిడ్ విల్లే ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడగా ఏడు వికెట్లు తీశాడు. 2010లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కేదార్ జాదవ్ ఇప్పటి వరకు 93 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 1196 పరుగులు చేశాడు. గతంలో ఆర్‌సీబీకి ప్రాతినిథ్యం వహించిన జాదవ్.. ఆ జట్టు తరఫున 17 మ్యాచ్‌లు ఆడాడు. అతన్ని కోటీ రూపాయల ధరకు ఆర్‌సీబీ తీసుకుంది.


Next Story

Most Viewed