రోహిత్ శర్మను సెల్ఫిష్ అంటే ఒప్పుకోం

by Disha Web Desk 2 |
రోహిత్ శర్మను సెల్ఫిష్ అంటే ఒప్పుకోం
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌-14 లో భాగంగా ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఘన విజయం సాధించింది. సొంత గడ్డపై ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. చివరి వరకు రోహిత్ శర్మ క్రీజులో ఉన్నా.. ధోని తన మాస్టర్ మైండ్‌తో ప్లాన్‌ చేసి చివరికి 20 పరుగుల తేడాతో జట్టును గెలిపించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీ చేశారు. 63 బంతుల్లో 105 పరుగులు చేసి చివరి వరకూ పోరాడారు. అయినా ఓటమి తప్పలేదు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా రోహిత్ శర్మపై ట్రోల్స్ మొదలయ్యాయి. సెంచరీ కోసమే రోహిత్ మెల్లగా ఆడారని విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో విమర్శిస్తున్న నెటిజన్లకు రోహిత్ ఫ్యాన్స్ కూడా స్ట్రాంగ్ కౌంటర్స్ ఇచ్చారు. రోహిత్‌ను సెల్ఫిష్ అంటే ఒప్పుకోం అని.. వరుసగా వికెట్లు పడుతున్నా భయం లేకుండా ఒక్కడే నిలబడ్డాడు. మిగతా ప్లేయర్ల నుంచి అతనికి సహకారం కూడా అందలేదు. చివర్లో రోహిత్‌కు స్ట్రైకింగ్ కూడా అంతగా రాలేదు. అందుకు అతనేం చేస్తాడు అని ట్రోలర్స్‌కు కౌంటర్ ఇచ్చారు.

Next Story

Most Viewed