IPL 2023: టాస్ గెలిచిన రాజస్థాన్.. ఆర్సీబీకి కొత్త కెప్టెన్

by Disha Web Desk 19 |
IPL 2023: టాస్ గెలిచిన రాజస్థాన్.. ఆర్సీబీకి కొత్త కెప్టెన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో భాగంగా బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో అతిథ్య బెంగళూరు తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఇక, ఆర్సీబీ రెగ్యూలర్ కెప్టెన్ డుప్లెసిస్‌కు గాయం కావడంతో ఈ మ్యాచ్‌కు కూడా విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మ్యాచ్‌కు హర్షల్ పటేల్, పార్నెల్‌ను పక్కన పెట్టిన ఆర్సీబీ.. డేవిడ్ విల్లీ, సుయాష్ ప్రభుదేశాయ్‌కు జట్టులో చోటు కల్పించింది. ఇక, జోస్ బట్లర్, సంజు శాంసన్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్‌తో ఆర్ఆర్ బలంగా ఉంది. మరి కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

జట్ల వివరాలు:

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(w/c), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి(సి), ఫాఫ్ డు ప్లెసిస్, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్(w), సుయాష్ ప్రభుదేశాయ్, డేవిడ్ విల్లీ, వనిందు హసరంగా, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైషాక్

Next Story

Most Viewed