2023 టాటా IPL విన్నర్‌కు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా..?

by Disha Web Desk 12 |
2023 టాటా IPL విన్నర్‌కు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించే అన్ని టీ20 లీగులకంటే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్.. చాలా రిచేస్ట్ అని చెప్పుకోవాలి. ఇలాంటి ఐపీఎల్ 2023 చివరి దశకు చేరుకుంది. ఈ నెల 28న నరేంద్ర మోడీ స్టేడియంలో చెన్నై, గుజరాత్ జట్ల మధ్య రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే టాటా ఐపీఎల్ 2023లో కప్ గెలిచిన జట్టుకు ఎంత ప్రైజ్‌మనీ వస్తుంది. రన్నరప్ గా నిలిచిన జట్టుకు ఎంత డబ్బు వస్తుంది అనే చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది.

టాటా ఐపీఎల్ 2023 గత సీజన్ కంటే ఎక్కువ ప్రైజ్ మని ఇవ్వనుంది. ఫైనల్ లో గెలిచిన జట్టుకు ట్రోఫి తో పాటుగా.. రూ. 20 కోట్లు అందించనున్నారు. అలాగే రన్నరప్ జట్టుకు 13 కోట్లు, మూడో స్థానంలో ఉన్న ముంబై కి 7 కోట్లు, నాలుగో స్థానంలో ఉన్న లక్నో జట్టుకు 6.5 కోట్లు ఇవ్వనున్నారు. దీంతో పాటుగా ఈ టోర్నీలో ప్రతిష్టాత్మకంగా అందించే ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ కలిగి ఉన్నవారికి కూడా.. ప్రత్యేక ప్రైజ్‌మనీ ఇస్తారు.

ఇందులో ఆరెంజ్ క్యాప్ విన్నర్‌కు 15 లక్ష్యలు, అలాగే పర్పుల్ క్యాప్ విన్నర్ కు 15 లక్షల చొప్పున ప్రైజ్ మని అందనుంది. వీటితో పాటుగా.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన ప్లేయర్‌కు రూ. 20 లక్షలు, అలాగే.. Most Valuable Player‌కు రూ. 12 లక్షలు, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ గా నిలిచిన బ్యాటర్‌కు 15 లక్షలు, టాటా న్యూ గేమ్ చెంజర్‌గా నిలిచిన ప్లేయర్‌ 12 లక్షలు అందుకుంటారు.

ఇవి కూడా చదవండి: IPL 2023 : టాప్ 5 బ్యాటింగ్ పర్ఫామెన్సెస్ ఇవే..

Next Story

Most Viewed