IPL 2026: వాంఖడేలో హై-వోల్టేజ్ పోరు: టాస్ గెలిచిన ముంబై

by Gantepaka Srikanth |

ఐపీఎల్ 2026 సీజన్‌లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది.

IPL 2026: వాంఖడేలో హై-వోల్టేజ్ పోరు: టాస్ గెలిచిన ముంబై
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్‌లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. క్రికెట్ కాశీగా పిలవబడే ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా.. ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (MI), డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడుతున్నాయి. ఈ కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఏమాత్రం తడబడకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. ముంబై పిచ్‌పై మంచు (Dew) ప్రభావం ఉండే అవకాశం ఉండటంతో, ఛేజింగ్‌కు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. దీంతో ఆర్సీబీ బ్యాటర్లు మొదట క్రీజులోకి రానున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆర్సీబీ, అదే ఊపును కొనసాగించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరాలని భావిస్తోంది. కోహ్లీ, రజత్ పాటిదార్‌లతో కూడిన బ్యాటింగ్ లైనప్ వాంఖడేలో పరుగుల వరద పారించాలని చూస్తోంది. మరోవైపు, వరుస అపజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్, ఈ మ్యాచ్‌తోనైనా గెలుపు బాట పట్టాలని పట్టుదలగా ఉంది. సొంత మైదానంలో అభిమానుల మద్దతుతో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ ప్లేయర్లు చెలరేగితే ముంబైకి తిరుగుండదు.

ఫ్యాన్స్ మధ్య ఉత్కంఠ..

హిట్ మ్యాన్ వర్సెస్ కింగ్ కోహ్లీ మధ్య పోరు చూడటానికి స్టేడియం నీలి రంగు (ముంబై), ఎరుపు రంగు (బెంగళూరు) జెండాలతో నిండిపోయింది. వాంఖడే స్టేడియంలో ఎప్పుడూ భారీ స్కోర్లు నమోదవుతుంటాయి, కాబట్టి నేడు పరుగుల పండగ గ్యారెంటీ అని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఆర్సీబీ భారీ స్కోరు సాధించి ముంబైని కట్టడి చేస్తుందా? లేక ముంబై బౌలర్లు బుమ్రా నేతృత్వంలో బెంగళూరును తక్కువ స్కోరుకే పరిమితం చేస్తారా? అనేది వేచి చూడాలి.

Next Story