- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, స్పోర్ట్స్: కరోనా విలయతాండవంతో దేశ ప్రజలంతా ఒకలాంటి భయాందోళనతో ఉన్నారని, మానసికంగా చాలా కుంగిపోయారని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. అయితే, ఐపీఎల్ వల్ల దేశ ప్రజల మానసిక స్థితి కాస్త కుదుటపడుతుందని ఆకాంక్షించారు. బీసీపీఐ నిర్వహిస్తున్న ఈ క్యాష్ రిచ్ లీగ్ ద్వారా ప్రజలకు సాంత్వన చేకూరుతుందని అన్నారు. స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన క్రికెట్ కనెక్టెడ్ అనే కార్యక్రమంలో గంభీర్ మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ యూఏఈలో జరుగుతుందా? ఇండియాలో జరుగుతుందా? అనేది ప్రస్తుతం అప్రస్తుతం. ముందు ఈ లీగ్ జరగడమే అందరికీ ముఖ్యం. ప్రజల దృష్టి ఆటలపై పడితే ఇప్పుడున్న దుస్థతి మారుతుందన్నారు. ఎవరు గెలుస్తున్నారు. ఎవరు ఓడుతున్నారు అనే పట్టింపుల కన్నా దేశ మానసిక స్థితి మారుతుంది. ఇప్పుడు నెలకొన్న భయాందోళనల దృష్ట్యా ఈ లీగ్ గతంలో జరిగిన లీగ్లకంటే గొప్పదవుతుంది. దేశానికి సాంత్వన చేకూరుస్తుంది’ అని అభిప్రాయపడ్డారు.