ఎమ్మెల్యేలకు గిఫ్టులుగా యాపిల్ ఐప్యాడ్‌లు

by  |
ఎమ్మెల్యేలకు గిఫ్టులుగా యాపిల్ ఐప్యాడ్‌లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా తీవ్రత క్రమంలో ఈ సారి డిజిటల్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం ఐప్యాడ్‌లను గిఫ్టుగా ఇచ్చింది. కరోనా కారణంగా బడ్జెట్ ప్రింటెడ్ కాపీలను పరిమిత సంఖ్యలోనే ముద్రించింది. డిజిటల్ విధానంలో సభ్యులందరికీ బడ్జెట్ పత్రాలను అందుబాటులో ఉంచేలా ప్రతిఒక్కరికీ యాపిల్ కంపెనీకి చెందిన ఐప్యాడ్‌లను ఉచితంగా గిప్టు రూపంలో అందించింది. మొత్తం 120 మంది ఎమ్మెల్యేలు, దాదాపు 40 మందిఎమ్మెల్సీలు ఈ గిఫ్టులను అందుకున్నారు. ప్రతీసారి బడ్జెట్ అనంతరం ఏదో ఒకరకమైన గిప్టులను అందించే ప్రభుత్వం.. ఈసారి మాత్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజునే అందించింది. ఒక్కో గిఫ్టు ప్యాక్ ఖరీదును అధికారులు బహిర్గతం చేయలేదు.



Next Story