పీవీపై కవితలకు ఆహ్వానం

by  |
పీవీపై కవితలకు ఆహ్వానం
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ పాతనగర కవుల వేదిక, లాల్ దర్వాజ ఆధ్యర్యంలో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి ఉత్సవాల సందర్భంగా ఒక కవితా సంకలనాన్ని డిసెంబరులో ఆవిష్కరించనున్నట్లు కన్వీనర్ కె.హరనాథ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా పీవీపై కవితలను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. కవితలు 30 లైన్లకు మించకుండా ఉండాలి. అక్టోబర్ 22వ తేదీలోగా 9703542598, 9182178653‌లకు వాట్సాప్‌లో పంపొచ్చునన్నారు. ఈ సంకలనం, బహుమతుల ప్రదానం డిసెంబరులో ఉంటుందన్నారు. ఆయన వర్ధంతి రోజు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇతర వివరాలకు పై నంబర్లలో సంప్రదించాలని కోరారు.


Next Story

Most Viewed