నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ స్కీమ్ దరఖాస్తుల ఆహ్వానం

by  |
Inter Board
X

దిశ, తెలంగాణ బ్యూరో: నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ స్కీమ్‌కు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు నవంబర్ 30 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. వీరితో పాటు 2021-22 అకాడమిక్ ఇయర్ లో నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ లకు అర్హతగల విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. డిసెంబర్ 15న ఇనిస్టిష్యునల్ వెరిఫికేషన్ చేపట్టనున్నట్టుగా ప్రకటించారు. స్కాలర్ షిప్ పొందేందుకు ఎంపికైన 81,594 మంది విద్యార్థుల జాబితాను ఇంటర్మిడియట్ వెబ్ సైట్ లో పొందుపరుస్తామని తెలిపింది.



Next Story

Most Viewed