- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో్ కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. మాజీ మంత్రి ఈటల బీజేపీలో చేరడంతో అప్పటివరకు పార్టీలో కొనసాగుతున్న సీనియర్ లీడర్ ఇనుగాల పెద్దిరెడ్డి కాషాయ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఈటలపై మరోసారి విరుచుకపడ్డారు. రెడ్డి ఆత్మీయుల మధ్య చిచ్చు పెట్టేందుకు చేస్తున్న కుట్రలను మానుకోవాలని మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి ఈటలకు హితవు పలికారు.
ఆదివారం అయన మీడియాతో మాట్లాడుతూ.. రెడ్డి ఆత్మీయ సమ్మేళన సభలో మంత్రి హరీష్ రావు వచ్చే మార్చిలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చినప్పటికీ పోతిరెడ్డి పేటకు ప్లకార్డులు ధరించి వెళ్లి హరీష్ రావు వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వినతి పత్రం సమర్పించే నెపంతో చిల్లర రాజకీయాలు చేస్తే సహించేది లేదన్నారు. ఇప్పటికైనా పద్దతి మార్చుకోవాలని సూచించారు.