ఆగస్టులో జేఎల్‌ఎమ్ పోస్టులకు ఇంటర్వ్యూలు

by  |

దిశ, న్యూస్‌బ్యూరో: ఇప్పటికే రాత పరీక్ష నిర్వహించి ఫలితాలు విడుదల చేసిన 2500 జూనియర్ లైన్ మెన్(జేఎల్‌ఎమ్) పోస్టుల భర్తీకి టీఎస్ఎస్పీడీసీఎల్ ఆగస్టు 3,4 వారాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఇందుకోసం ముగ్గురు అధికారులతో ఇంటర్వ్యూ కమిటీని నియమించింది. 2019 సెప్టెంబర్‌లో నిర్వహించిన ఈ పోస్టుల రాత పరీక్ష ఫలితాలను ఈ సంవత్సరం జనవరిలో సంస్థ వెల్లడించింది. ఈ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన వారి క్వాలిఫైడ్ ర్యాంకులను ఈ నెల 9న ప్రకటించింది.



Next Story

Most Viewed