ఇంటర్ విద్యార్థిని బలితీసుకున్న డెంగ్యూ

by  |
ఇంటర్ విద్యార్థిని బలితీసుకున్న డెంగ్యూ
X

దిశ, అచ్చంపేట: నాగర్‎కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం కొత్తపల్లికి చెందిన సూర్య (17) అనే ఇంటర్ స్టూడెంట్ డెంగ్యూ వ్యాధితో బుధవారం సాయంత్రం మృతి చెందినట్టు బంధువులు తెలిపారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ కాంతమ్మ-ధనరాజుల రెండవ కుమారుడు సూర్య.. వట్టెం నవోదయ పాఠశాలలో ఇంటర్ చదువుతున్నట్టు తెలిపారు. ఇటీవల జరిగిన ఇంటర్ పరీక్షల సందర్భంగా ప్రతిరోజు ఇంటి నుంచి కళాశాలకు వెళ్లి పరీక్షలు రాసి వచ్చాడని, ఇదే సమయంలో జ్వరంతో పాటు డెంగ్యూ వ్యాధి సోకిందని తెలిపారు. ముందుగా అచ్చంపేటలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని మరో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయినప్పటికీ మంగళవారం పరిస్థితి విషమించడంతో చివరకు యశోద ఆస్పత్రిలో చేర్చించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో సూర్య మృతి చెందాడని బంధువులు తెలిపారు.


Next Story