ఎమ్మెల్సీ అభ్యర్థి సతీష్‌కు ఇంటర్ విద్యా జేఏసీ మద్దతు

by  |
ఎమ్మెల్సీ అభ్యర్థి సతీష్‌కు ఇంటర్ విద్యా జేఏసీ మద్దతు
X

దిశ, క్రైమ్ బ్యూరో: మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి, కేజీ టు పీజీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ గౌరీ సతీష్ సోమవారం పలు ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్ విద్యా జేఏసీ కన్వీనర్ డాక్టర్ మధుసూధన్ రెడ్డిని కలిసి మద్దతు ఇవ్వాలని కోరగా, డాక్టర్ మదుసూధన్ రెడ్డి తన మద్దతు మీకే ఉంటుందని ప్రకటించారు. ఈ సందర్భంగా గౌరీ సతీష్ మాట్లాడుతూ… రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,91,854 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత ఏడేండ్లుగా ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో.. నిరుద్యోగుల వయోపరిమితి దాటిపోతుందన్నారు. దీంతో వారు నిరాశ, నిస్పృహాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు విద్యాసంస్థలలో పనిచేస్తున్న బోధనా, బోధనేతర సిబ్బందిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోకపోవడం శోచనీయం అన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను త్వరితగతిన భర్తీ చేయాలని కోరారు.

Next Story