కాంగ్రెస్ కార్యాలయం ఎదుట గాంధీ విగ్రహానికి ఘోర అవమానం

by  |
కాంగ్రెస్ కార్యాలయం ఎదుట గాంధీ విగ్రహానికి ఘోర అవమానం
X

దిశ, బెల్లంపల్లి : పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయం ఎదుట ఉన్న గాంధీ విగ్రహం చేతి కర్రను గుర్తు తెలియని దుండగులు ఆదివారం రాత్రి ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కంకటి శ్రీనివాస్ ఒకటో పట్టణ సీఐ రాజుకు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించేందుకు అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి గాంధీజీ అని అన్నారు. ఈ క్రమంలో విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed