పథకాలు రావాలంటే ఎమ్మెల్యేల రాజీనామాకు పట్టుబట్టండి

by  |
CM KCR YS Sharmila
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్‌లో కౌశిక్ రెడ్డి చేరిక సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై షర్మిల గురువారం ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా జనాలను మోసం చేస్తూ గెలుస్తున్నట్లు ఒప్పుకున్నారన్నారు. ఈ విషయంలో ప్రజలంతా ఆలోచించాలని ఆమె సూచించారు. టీఆర్ఎస్ హయాంలో ఎన్నికలు ఉంటేనే పథకాలు వస్తాయని, ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని ఆమె తెలిపారు. ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఏదో ఒక పథకం తీసుకొస్తాం తప్పా.. ప్రజల అభివృద్ధి మాకు మాత్రం పట్టదని చెప్పినందుకు సంతోషమని ఆమె చురకలంటించారు.

తమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ప్రజలంతా పట్టుబట్టి మీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని ఆమె కోరారు. ఉప ఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్ దృష్టి మీ ప్రాంతంపై పడుతుందని, ఆ సమయంలో కొత్త పథకాలు అమలు చేస్తారన్నారు. అయితే గెలిచాక మాత్రం మళ్లీ మూలకు పడేస్తారని ఆమె ట్వీట్ చేశారు.

Next Story

Most Viewed