చత్తీస్ ఘడ్‌లో పేలుడు.. ముగ్గురు కూలీలకు గాయాలు

by  |
చత్తీస్ ఘడ్‌లో పేలుడు.. ముగ్గురు కూలీలకు గాయాలు
X

దిశ, భద్రాచలం : చత్తీస్ ఘడ్‌లోని నారాయణపూర్ – కాంకేర్ సరిహద్దులోని అంజ్రోల్ సమీపంలో నక్సలైట్లు ఐఈడీ పేల్చారు. ఈ పేలుడు కారణంగా కూలీలు సేక్ ​​అస్లాం, మున్షీ, పవన్‌లు తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నారాయణపూర్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఉదయం 11.30 గంటల సమయంలో పేలుడు సంభవించినట్లు సమాచారం. రాఘాట్ ప్రాజెక్టు, చార్గావ్ గనులను మూసివేయాలని గత రాత్రి‌ మావోయిస్టులు ఈ ప్రాంతంలో బ్యానర్లు, పోస్టర్లు వేశారు. అలాగే పంప్ హౌస్‌ని నక్సలైట్లు ధ్వంసం చేశారు. అంజ్రోల్ గనులకు చేరువలో‌ ఉన్న ఓపెన్ బీఎస్ఎఫ్ క్యాంపుకు సమీపంలో ఉదయం పేలుడు సంభవించింది. పేలుడు ఘటన అనంతరం ఆ ప్రాంతంలో పోలీసులు సోదాలు ముమ్మరం చేశారు. నారాయణపూర్ ఎస్‌పీ గిర్జా శంకర్ జైస్వాల్ ఈ పేలుడు ఘటనను ధృవీకరించారు.


Next Story

Most Viewed