- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, క్రైమ్ బ్యూరో: ఓటుకు నోటు కేసులో మంగళవారం ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యపై అవినీతి నిరోధక చట్టం ప్రకారం వచ్చిన అభియోగాల నమోదుకు సంబంధించిన అంశాలను ఏసీబీ కోర్టు చదివి విన్పించింది. అనంతరం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యపై కోర్టు విచారణను ప్రారంభించింది. ఈ సందర్భంగా సండ్ర తనపై వచ్చిన అభియోగాలను తోసిపుచ్చారు. ఇదిలా ఉండగా, ఈ కేసులో సండ్రతో పాటు రేవంత్ రెడ్డి, సెబాస్టియన్ హాజరు కాగా, ఉదయ్ సింహా గైర్హాజరయ్యారు. దీంతో ఉదయ్ సింహాపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ నెల 22కు ఓటుకు నోటు కేసు విచారణను కోర్టు వాయిదా వేసింది.
Next Story