ఓటుకు నోటు కేసులో సండ్రపై విచారణ ప్రారంభం

by  |
ఓటుకు నోటు కేసులో సండ్రపై విచారణ ప్రారంభం
X

దిశ, క్రైమ్ బ్యూరో: ఓటుకు నోటు కేసులో మంగళవారం ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యపై అవినీతి నిరోధక చట్టం ప్రకారం వచ్చిన అభియోగాల నమోదుకు సంబంధించిన అంశాలను ఏసీబీ కోర్టు చదివి విన్పించింది. అనంతరం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యపై కోర్టు విచారణను ప్రారంభించింది. ఈ సందర్భంగా సండ్ర తనపై వచ్చిన అభియోగాలను తోసిపుచ్చారు. ఇదిలా ఉండగా, ఈ కేసులో సండ్రతో పాటు రేవంత్ రెడ్డి, సెబాస్టియన్ హాజరు కాగా, ఉదయ్ సింహా గైర్హాజరయ్యారు. దీంతో ఉదయ్ సింహాపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ నెల 22కు ఓటుకు నోటు కేసు విచారణను కోర్టు వాయిదా వేసింది.

Next Story

Most Viewed