కాళేశ్వరం వద్ద మళ్లీ సేమ్ పొజిషన్

by  |
కాళేశ్వరం వద్ద మళ్లీ సేమ్ పొజిషన్
X

దిశ ప్రతినిది, కరీంనగర్: కాళేశ్వరం వద్ద మళ్లీ గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. 10.70 మీటర్ల ఎత్తు వరకు నీరు వచ్చి చేరింది. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో వరద నీరు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోంది. మహారాష్ట్రలోని పెన్ గంగపై నిర్మించిన గోషై కుర్దా ప్రాజెక్టు వద్ద భారీగా ఇన్ ఫ్లో వస్తుండడంతో అధికారులు ఆదివారం 46 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. దీంతో కాళేశ్వరం వద్ద వరద ఉధృతి పెరిగింది.

నిన్నటి వరకు 1 లక్ష క్యూసెక్కుల వరద ఇన్ ఫ్లోగా రాగా ఒక్క రోజులోనే 5.21 లక్షల క్యూసెక్కులకు చేరింది. దీంతో మేడిగడ్డ వద్ద 65 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. 16.17 టీఎంసీల సామర్థ్యం ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు ఇప్పటికే 5. 15 టీఎంసీల నీటిని ఇరిగేషన్ అధికారులు నిలువ ఉంచారు. అయితే అనూహ్యంగా మహారాష్ట్ర నుండి భారీగా నీరు వచ్చి చేరుతుండడంతో ఇన్ ఫ్లోగా వచ్చే నీటినంతా కూడా దిగువకు వదులుతున్నారు.



Next Story

Most Viewed