‘రైతుల బాధ్యత అధికారులదే’

by  |
‘రైతుల బాధ్యత అధికారులదే’
X

దిశ, ఆదిలాబాద్: రైతులు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలో బుధవారం ఆయన మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మక్కల కొనుగోళ్లు వేగంగా పూర్తిచేసి, వెంటనే డబ్బులు చెల్లించాలని ఆదేశించారు. ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే తహసీల్దార్, వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు.

Tags: crop buy centre, indrakaran reddy, minister, nirmal, sone mandal, mro, agriculture officers, corona, lockdown

Next Story