ఐసోలేషన్‌లో ఇండోనేషియా బ్యాడ్మింటన్ జట్టు

by  |
AEOBC
X

దిశ, స్పోర్ట్స్: ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కోసం లండన్ చేరుకున్న ఇండోనేషియా ఆటగాళ్లు అందరినీ 10 రోజల పాటు ఐసోలేషన్‌కు పంపించారు. వాళ్లు లండన్ చేరుకోవడానికి ప్రయాణించిన విమానంలో కోవిడ్-19 కేసు నిర్దారణ అవడంతో ముందు జాగ్రత్తగా వారిని ఐసోలేషన్‌కు తరలించినట్లు బీడబ్ల్యూఎఫ్ ప్రకటించింది. వీరితో పాటు టర్కీకి చెందిన క్రీడాకారిణి నీస్లిహాన్ యజిత్ కూడా ఐసోలేషన్‌కు వెళ్లింది. కాగా, వీరిందరూ ఆల్‌ ఇంగ్లాండ్ ఓపెన్ నుంచి తొలగించబడ్డారని.. అయితే డ్రాలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్‌లు జరుగుతాయని బీడబ్ల్యూఎఫ్ ప్రకటించింది.

Next Story

Most Viewed