57 శాతం పెరిగిన ఎగుమతులు

by  |
57 శాతం పెరిగిన ఎగుమతులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంజనీరింగ్, పెట్రోలియం ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాల వంటి రంగాల్లో ఎగుమతుల వృద్ధి కారణంగా మే నెలలో భారత ఎగుమతులు 56.94 శాతం పెరిగాయి. అయినప్పటికీ, సమీక్షించిన నెలలో భారత వాణిజ్య లోటు 99.61 శాతం పెరిగి 6.28 బిలియన్ డాలర్లు(రూ. 46 వేల కోట్లు)గా నమోదైనట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. గతేడాది ఇదే నేలలో వాణిజ్య లోటు 3.15 బిలియన్ డాలర్లు(రూ. 23.1 వేల కోట్లు)గా నమోదైంది. సమీక్షించిన నెలలో మొత్తం ఎగుమతులు(సరుకులు, సేవలు కలిపి) 98.29 బిలియన్ డాలర్లు(రూ. 7.2 లక్షల కోట్లు)గా ఉన్నాయి.

సమీక్షించిన కాలానికి దిగుమతులు 77.82 శాతం పెరిగి 104.14 బిలియన్ డాలర్లు(రూ. 7.6 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. అత్యధికంగా చమురు దిగుమతులు 171 శాతం పెరిగి 9.45 బిలియన్ డాలర్లు(రూ. 69.3 వేల కోట్లు)గా నమోదయ్యాయి. మే నెలలో ఇంజనీరింగ్ ఎగుమతులు 8.64 బిలియన్ డాలర్లు(రూ. 63.3 వేల కోట్లు), పెట్రోలియం ఉత్పత్తులు 5.33 బిలియన్ డాలర్లు(రూ. 39 వేల కోట్లు)గా నమోదయ్యాయి.



Next Story