మీ వల్ల దేశం పరువు పోయింది: అఖిలేశ్ యాదవ్

by Shamantha N |

<p>లక్నో : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అధికార దుర్వినియోగం, అలసత్వం కారణంగా అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ఉన్న పరువు గంగలో కలిసిందని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన అఖిలేశ్.. భారత్‌లో కరోనా పేషెంట్ల ఆర్తనాదాలు, మరణాలను ప్రపంచ మీడియా హైలైట్ చేయడాన్ని ప్రస్తావించారు. ఆయన స్పందిస్తూ.. ‘బీజేపీ ప్రభుత్వం అలసత్వం కారణంగా భారత్‌లో కరోనా మరణాల గురించి అంతర్జాతీయ పత్రికలు, మ్యాగజైన్‌లు సైతం వార్తలు రాస్తున్నాయి. ప్రపంచ దేశాల ముందు [&hellip;]</p>

మీ వల్ల దేశం పరువు పోయింది: అఖిలేశ్ యాదవ్
X

లక్నో : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అధికార దుర్వినియోగం, అలసత్వం కారణంగా అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ఉన్న పరువు గంగలో కలిసిందని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన అఖిలేశ్.. భారత్‌లో కరోనా పేషెంట్ల ఆర్తనాదాలు, మరణాలను ప్రపంచ మీడియా హైలైట్ చేయడాన్ని ప్రస్తావించారు. ఆయన స్పందిస్తూ.. ‘బీజేపీ ప్రభుత్వం అలసత్వం కారణంగా భారత్‌లో కరోనా మరణాల గురించి అంతర్జాతీయ పత్రికలు, మ్యాగజైన్‌లు సైతం వార్తలు రాస్తున్నాయి. ప్రపంచ దేశాల ముందు భారత్ పరువు పోయింది’ అంటూ ట్వీట్ చేశారు. అంతేగాక నిత్యం అబద్దాలు చెప్పేవారు సదరు పబ్లిషర్ల (మరణాలను రిపోర్టు చేసిన) వారిపై ఆంక్షలు విధిస్తారా..? లేక కేసులు పెడతారా..? అని బీజేపీని ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు.

Next Story