బిగ్ అనౌన్స్‌మెంట్.. టీ-20 వరల్డ్ కప్‌కు భారత జట్టు ప్రకటన

by  |
బిగ్ అనౌన్స్‌మెంట్.. టీ-20 వరల్డ్ కప్‌కు భారత జట్టు ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: భారత అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అనౌన్స్‌మెంట్‌ను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. టీ-20 వరల్డ్‌కప్ కోసం టీమిండియా జట్టు వివరాలు వెల్లడించింది. జట్టులో విరాట్ కోహ్లీ (Capt), రోహిత్ శర్మ(vc), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (wk), ఇషాన్ కిషన్ (wk), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్సర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీలు ఉన్నారు. స్టాండ్ బై ప్లేయర్లుగా శ్రేయస్ అయ్యర్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్‌లు ఉండటం విశేషం. ఇది ఇలా ఉంటే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఈ టీ-20 వరల్డ్ కప్‌కు సలహాదారుడిగా ఉంటాడని బీసీసీఐ అనౌన్స్‌మెంట్ చేయడంతో అభిమానులు తెగ సంబురాలు చేసుకుంటున్నారు. నెట్టింట్లో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.


Next Story