అక్రిడిటేషన్ల జీవోపై ప్రెస్ కౌన్సిల్ విచారణ

by  |
అక్రిడిటేషన్ల జీవోపై ప్రెస్ కౌన్సిల్ విచారణ
X

దిశ, ఏపీబ్యూరో : రాష్ట్ర, జిల్లాస్థాయి మీడియా ప్రతినిధుల అక్రిడిటేషన్ల నియమ, నిబంధనలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలోని లోపాలను భారత ప్రెస్‌ కౌన్సిల్‌ తీవ్రంగా పరిగణించింది. ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించింది.

ముఖ్యంగా రాష్ట్ర మీడియా సమన్వయ కమిటీలో గుర్తింపు పొందిన ప్రధాన స్రవంతి మీడియా, ప్రెస్‌ కౌన్సిల్‌ సభ్యుల ప్రాతినిధ్యానికి సంబంధించి గత నెల 8న విడుదల చేసిన ఈ జీవోలో పేర్కొన్న నిబంధనలు తమ మోడల్‌ అక్రిడిటేషన్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా లేవని పేర్కొంది. జీవోలోని సవరణలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరుతూ నోటీసు జారీ చేయాలని ప్రెస్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ జస్టిస్‌ సీకే ప్రసాద్‌ ఆదేశాలు జారీ చేశారు.


Next Story

Most Viewed