- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: ప్రముఖ మోటర్సైకిల్ సంస్థ ఇండియన్ చీఫ్ దేశీయ మార్కెట్లో కొత్తగా మూడు బైకులను విడుదల చేసింది. వీటిధరలు రూ. 20.75 లక్షల(ఎక్స్షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. చీఫ్ డార్క్ హార్స్, ఇండియన్ చీఫ్ బాబర్ డార్క్ హార్స్, ఇండియన్ సూపర్ చీఫ్ లిమిటెడ్ పేరుతో ఈ మోడళ్లను కంపెనీ తీసుకొచ్చింది. వీటిలో ఇండియ సూపర్ చీఫ్ లిమిటెడ్ మోదల్ అత్యధీకంగా రూ. 22.84 లక్షల ధరలో లభిస్తుందని కంపెనీ పేర్కొంది.
ఈ మోడల్ బైకులు 1,890 సీసీ ఎయిర్కూల్డ్ ఇంజిన్తో పనిచేస్తాయని, సర్క్యులర్ టచ్ స్క్రీన్ రైడ్, స్టాండర్డ్ ఫీచర్గా యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ఏబీఎస్) ఉన్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికీ వీటిని కొనేందుకు ప్రీ-బుకింగ్స్ ప్రారంభించామని, ముందుగా రూ. 3 లక్షలు చెల్లించడం ద్వారా బైకు బుక్ చేసుకోవచ్చని కంపెనీ వివరించింది. ఈ మోడల్ బైకుల్లో అధిక శక్తి అవసరంలేని సమయంలో ఇంజిన్ వెనక ఉన్నటువంటి ఇంజిన్ను ఆఫ్ చేసుకునే వీలుంటుందని కంపెనీ పేర్కొంది. 15 లీటర్ల ఫ్యుయెల్ ట్యాంక్, ఎల్ఈడీ లైటింగ్, కీ-లెస్ ఇగ్నిషన్ లాంటి అత్యాధునిక ఫీచర్లను ఇందులో అందిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది.
‘దేశీయంగా కొత్త మోడళ్లను తీసుకురావడం సంతోషంగా ఉంది. ఈ బ్రాండ్ 100వ వార్షికోత్సవం సందర్భంగా భారతీయ వాహనదారుల కోసం వీటిని విడుదల చేశాం. ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన అభిమానులకు కలిగిన తమ సంస్థ భారత మార్కెట్లో మరింత మంది వినియోగదారులను సంపాదిస్తుందని’ ఇండియన్ చీఫ్ ఇండియా మేనేజర్ లలిత్ శర్మ చెప్పారు.