గతంలోనూ జాతి వివక్షను ఎదుర్కొన్నాం: అశ్విన్

by  |
గతంలోనూ జాతి వివక్షను ఎదుర్కొన్నాం: అశ్విన్
X

దిశ,వెబ్‌డెస్క్: తాము గతంలోనూ జాతి వివక్షను ఎదుర్కొన్నామని టీం ఇండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నారు. అస్ట్రేలియా ప్రేక్షకులు పలు‌మార్లు అసభ్యంగా మాట్లాడారని ఆయన తెలిపారు. ప్రేక్షకుల తీరుపై క్రికెట్ ఆస్ట్రేలియాకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. కాగా మూడో రోజు ఆట ముగిసిన తర్వాత తమ జట్టు అధికారులకు ఫిర్యాదు చేసిందని తెలిపారు. అయినప్పటికీ వారిపై చర్యలు తీసుకోకుండా… నాలుగవ రోజు కూడా అదే తరహా వ్యాఖ్యలను అస్ట్రేలియా అభిమానులు కొనసాగించేందుకు అనుమతించేలా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ అధికారులు తీరు ఉండటం తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. జాతి వివక్షకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed