గంటా శ్రీనివాసరావుకి ఇండియన్ బ్యాంక్ ఝలక్

by  |
గంటా శ్రీనివాసరావుకి ఇండియన్ బ్యాంక్ ఝలక్
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు ఇండియన్ బ్యాంక్ షాక్ ఇచ్చింది. గ౦టా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష కంపెనీ ఆస్తులను వేలం వేయాలని ఇండియన్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఈ నెల 25న వేల౦ నిర్వహించనున్నారు. అయితే గతంలో రూ. 248 కోట్ల రూపాయల మేర ప్రత్యూష క౦పెనీ ఇండియన్ బ్యాంక్ నుంచి రుణం తీసుకుంది. ఆ లోన్‌కు సంబంధించి, 2006 అక్టోబర్ 4న రుణం చెల్లించాలంటూ బ్యాంక్ మొదటిసారి నోటీసులు జారీ చేసింది. సమాధానం రాని క్రమంలో.. 2006 డిసెంబర్ 27న, తిరిగి 2017 ఫిబ్రవరి 21న బ్యాంకులో కుదవ బెట్టిన ప్రత్యూష కంపెనీ ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


Next Story

Most Viewed