ట్రంప్‌ దంపతుల కోసం పూజలు

by  |
ట్రంప్‌ దంపతుల కోసం పూజలు
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియాలు కరోనా భారీన పడిన సంగతి తెలిసిందే. అయితే వారిద్దరి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఇండియన్ అమెరికన్స్ పూజలు చేస్తున్నారు. సెంటినల్స్ ఆఫ్ ధర్మా అనే హిందూ అమెరికన్ సంస్థ ట్రంప్ త్వరగా కోలుకోవాలని పూజా కార్యక్రమం నిర్వహించగా.. ఇందులో భారీ సంఖ్యలో భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు.

అంతేకాకుండా ఎన్నికల్లో ట్రంప్‌ను గెలిపించేందుకు తమ వంతు సాయం చేస్తామని ప్రకటించడం గమనార్హం. అయితే, ట్రంప్ తన ఆరోగ్యం పై వివరణ ఇచ్చేందుకు వాషింగ్టన్‌లోని వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్ నుంచి కాసేపు బయటకొచ్చారు. తన కారులో తిరుగుతూ మద్దతుదారులకు తానే క్షేమంగా ఉన్నానంటూ సూచనలు చేశాడు.

Next Story