T20 సమరం.. వన్డే సీన్ రిపీట్ అయ్యేనా..?

by  |
cricket
X

దిశ, వెబ్‌డెస్క్ : భారత్ వర్సెస్ శ్రీలంక రెండో టీ-20 సమరం నేడు రాత్రి 8 గంటలకు కొలంబో వేదికగా జరగనుంది. తొలి టీం-20లో ఇరగదీసిన టీం ఇండియా ఏకంగా సిరీస్ కైవసం చేసుకోవాలని ఉవ్విల్లురుతోంది. మూడు మ్యాచుల సిరీస్‌లో భాగంగా ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ టైటిల్‌పై ధావన్ సేన కన్నేసినట్లు తెలుస్తున్నది. తొలి మ్యాచ్‌లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, ధావన్ రాణించగా.. ఈ ఏడాది చివర్లో టీ-20 వరల్డ్ కప్‌ జరగనున్న నేపథ్యంలో తమ సత్తా చాటి.. తుది జట్టులో స్థానం దక్కించుకునేందుకు కుర్రాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.


Next Story

Most Viewed