స్కాట్‌లాండ్‌తో టీమిండియా ఫైట్.. దుబాయ్‌లో మెరిసేదెవరు..?

by  |
స్కాట్‌లాండ్‌తో టీమిండియా ఫైట్.. దుబాయ్‌లో మెరిసేదెవరు..?
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా టీమిండియా జట్టు మరి కొద్దిగంటల్లోనే స్కాట్‌లాండ్‌తో తలపడనుంది. ఇప్పటికే మూడు మ్యాచులు ఆడిన టీమిండియా రెండు మ్యాచుల్లో పరాజయం పొంది, గత అఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌లో 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక స్కాట్‌లాండ్ ఆడిన 3 మ్యాచుల్లోనూ ఓడిపోయింది. దీంతో టీ20 వరల్డ్ కప్‌లో బోణీ కొట్టేందుకు స్కాట్‌లాండ్ సన్నద్ధం కాగా, అద్భుతాలు సృష్టించి సెమీస్‌కు వెళ్లేందుకు టీమిండియా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇక ఈ మ్యాచ్‌లో ఇండియా భారీ తేడాతో విజయం సాధిస్తే.. రన్‌రేట్‌ మెరుగుపడనుంది. ఈ నేపథ్యంలోనే సెమీస్ రేసులో ఉన్న న్యూజీలాండ్-అప్ఘనిస్తాన్‌లు ఇతర మ్యాచుల్లో ఓటమి పాలైతే టీమిండియాకు కలిసి రానుంది. దీంతో స్కాట్‌లాండ్‌ మ్యాచ్‌లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుందో అనేది అభిమానుల్లో ఉత్కంఠను రేపుతోంది.

Next Story