ఇండియా vs ఇంగ్లాండ్: విరాట్ కోహ్లీ ఔట్

by  |
ఇండియా vs ఇంగ్లాండ్: విరాట్ కోహ్లీ ఔట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పూణే వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 66 పరుగులతో మంచి ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ ఔట్ అయ్యాడు. 32వ ఓవర్‌లో ఆదిల్ రషీద్ వేసిన స్పిన్ బంతిని డిఫెన్స్ చేయబోయిన కోహ్లీ.. కీపర్‌ జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 158 పరుగుల వద్ద కోహ్లీ పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఉన్నారు. 33 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు 164/3గా ఉంది.

Next Story