‘చైనాలోకి మా దేశ పౌరులను అనుమతించండి’

by  |
‘చైనాలోకి మా దేశ పౌరులను అనుమతించండి’
X

న్యూఢిల్లీ: చైనాలో చదువుకుంటున్న విద్యార్థులు, ఉద్యోగులను ఆ దేశంలోకి ప్రవేశించడానికి అనుమతించాలని భారత్ విజ్ఞప్తి చేసింది. చైనా పౌరులు భారత్‌లోకి ప్రవేశిస్తున్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. కొవిడ్ ప్రొటోకాల్స్ కచ్చితంగా పాటిస్తూనే ఇరుదేశాల మధ్య అవసరమైన ప్రయాణాలు సాగడానికి సహకరించాలని తెలిపింది. వీసాలను రద్దు చేయడంతో నవంబర్ నుంచి భారతీయులు చైనాలోకి ప్రవేశించలేకపోతున్నారు. అయితే, చైనీస్ టీకా వేసుకుంటేనే అనుమతిస్తామన్న చైనా ఎంబసీ నోటిఫికేషన్‌ను విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి గుర్తుచేశారు. అందుకు అనుగుణంగా టీకా తీసుకున్న తర్వాత భారత పౌరులు చైనా వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నారని, త్వరలోనే వారికి టీకా మంజూరు చేస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.


Next Story