థాయ్‌లాండ్ వెళ్లనున్న సింధు, సైనా

by  |
థాయ్‌లాండ్ వెళ్లనున్న సింధు, సైనా
X

దిశ, స్పోర్ట్స్ : కరోనా కారణంగా బ్యాడ్మింటన్ కోర్టులకు దూరమైన స్టార్ ప్లేయర్లు తిరిగి రాకెట్ పట్టనున్నారు. టోక్యో ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకొని భారత ఒలింపిక్ సంఘం 8 మందితో కూడిన జట్టును ప్రకటించింది. భారత్ తరఫున ఒలింపిక్స్‌కు ఇంకా ఎవరూ అర్హత సాధించలేదు. దీంతో జనవరి నుంచి జరుగనున్న థాయిలాండ్ ఓపెన్‌తో పాటు బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు కూడా ఇదే జట్ట ప్రాతినిత్యం వహించనున్నది. భారత జట్టులో పీవీ సింధు, సైనా నెహ్వాల్, బి. సాయి ప్రణీత్, కిదాంబి శ్రీకాంత్, సాత్విత్ సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ షెట్టి, అశ్వినిపొన్నప్ప, సిక్కి రెడ్డి చోటు సంపాదించారు. వీళ్లు జనవరి 12 నుంచి 17 వరకు జరిగే యోనెక్స్ థాయిలాండ్ ఓపెన్ ఆ తర్వాత జనవరి 19 నుంచి 24 వరకు జరిగే జరిగే టొయోటా థాయిలాండ్ ఓపెన్‌లలో పాల్గొననున్నారు.

అలాగే ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ జనవరి 27 నుంచి 31 వరకు జరుగనున్నది. ఇందులో కూడా ఈ 8 మంది షట్లర్లు పాల్గొంటారు. కరోనా మహమ్మారి అనంతరం కిదాంబి శ్రీకాంత్ ఒక్కడే ఆక్టోబర్‌లో డెన్మార్క్‌లో జరిగిన టోర్నీలో పాల్గొన్నాడు. మిగతా వాళ్లు ఏ టోర్నీ కూడా ఆడలేదు. జనవరిలో జరిగే మూడు టోర్నీలకు ఈ 8 మంది క్రీడాకారులతో పాటు వారి వ్యక్తిగత కోచ్‌లు, ట్రైనర్లు వెంట వెళ్తారు. కీలకమైన ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌కు ముందు ఈ టోర్నీలు ఆడటం వల్ల షట్లర్లకు మంచి మ్యాచ్ ప్రాక్టీస్ లభించే అవకాశం ఉన్నది.



Next Story

Most Viewed