ఆధిపత్య పోరులో.. బహుజనులు బలి కావొద్దు

by  |
ఆధిపత్య పోరులో.. బహుజనులు బలి కావొద్దు
X

దిశ, గజ్వేల్: రాష్ట్రంలో రాబోయేది బహుజన రాజ్యం అని, కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్‌.కృష్ణయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో స్వతంత్ర అభ్యర్థి కొట్టాల యాదగిరికి మద్దతుగా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్ర కులాల ఆధిపత్య పోరులో బహుజనులు బలి కావద్దన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు సీట్లు కేటాయించాలన్నారు. కేసీఆర్‌ నియంతపాలనతో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. ఉద్యమస్ఫూర్తితో బహుజనుల అంతా ఏకమై స్వతంత్ర అభ్యర్థి కొట్టాల యాదగిరికి మద్దతు పలికి సిలిండర్‌ గుర్తుకే ఓటు వేయాలని విన్నవించారు.



Next Story

Most Viewed