పాజిటివ్ పరేషాన్.. పాఠశాలల్లోపెరిగిన కరోనా కేసులు

by  |
పాజిటివ్ పరేషాన్.. పాఠశాలల్లోపెరిగిన కరోనా కేసులు
X

దిశ వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య భారీ గా పెరుగుతుంది. ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వైరస్ వ్యాపిస్తోంది. అయితే తాజాగా హయత్ నగర్ లోని పాఠశాలతో పాటు కళాశాలలో చదువుతున్న 30 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అలాగే హయత్ నగర్ లోని సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాల హాస్టల్లో 37 మంది విద్యార్థులు కరోనా బారినపడగా, నలుగురు సిబ్బందికి కూడా కరోనా సోకినట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన విద్యాశాఖ అధికారులు విద్యార్థుల తల్లిదండ్రులకు అండగా నిలిచారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అయితే ఈ వసతి గృహంలో 400 మంది విద్యార్థులు ఉండడంతో, వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.

Next Story