యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ

by  |
యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు విపరీతంగా ఆలయానికి తరలివచ్చారు. దీంతో భక్తులకు థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్, భౌతికదూరం ఉంచుతూ, దర్శణానికి అనుమతి ఇస్తున్నారు. కోవిడ్ విస్తరిస్తున్న తరుణంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆలయ అధికారులు తెలిపారు. యాదాద్రి ఆలయ పున:నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో కొండపైకి పోలీసులు వాహనాలను అనుమతించడం లేదు.

Next Story