పన్ను చెల్లింపుదారుల రిటర్న్ దాఖలుకు గడువు పెంపు 

by  |
పన్ను చెల్లింపుదారుల రిటర్న్ దాఖలుకు గడువు పెంపు 
X

దిశ, వెబ్‌డెస్క్: 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు రిటర్నులను దాఖలు చేసేందుకు గడువును డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. ఖాతాలను ఆడిట్ చేయాల్సిన పన్ను చెల్లింపుదారుల కోసం ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు గడువును వచ్చే ఏడాది జనవరి 31 వరకు రెండు నెలలు పొడిగించారు.

ప్రభుత్వం మేలో ఐటీఆర్ దాఖలు చేయడానికి నవంబర్ 30 వరకు పొడిగించింది. పన్ను చెల్లింపుదారులకు పన్ను రిటర్నులను ఇచ్చేందుకు డిసెంబర్ చివరి వరకు, ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఐటీఆర్, ఖాతాలను ఆడిట్ చేయవలసి ఉంటుంది. ఆదాయ పన్ను రిటర్నులను ఇచ్చేందుకు పన్ను చెల్లింపుదారులకు ఎక్కువ సమయం ఇచ్చినట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్(సీబీడీటీ) ఓ ప్రకటనలో పేర్కొంది.



Next Story

Most Viewed